బీహార్లో చిక్కిన షర్జిల్

బీహార్లో చిక్కిన షర్జిల్

జెహనాబాద్(బీహార్): ‘నార్త్​ ఈస్ట్​ రాష్ట్రాలను ఇండియా నుంచి విడగొట్టేద్దాం’ అంటూ వివాదాస్పద కామెంట్స్​ చేసిన జేఎన్​యూ స్కాలర్ షర్జీల్ ఇమామ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బీహార్​జెహనాబాద్​ జిల్లాలోని తన పూర్వీకుల ఇంట్లో దాక్కున్న షర్జీల్​ను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ​ గుప్తేశ్వర్​ పాండే చెప్పారు. షర్జిల్​ను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్​కు అప్పగించాలని కోరనున్నట్లు సమాచారం. అయితే, షర్జిల్ ను బీహార్​లో ప్రశ్నిస్తారా.. లేక ఢిల్లీకి తరలించి అక్కడ ప్రశ్నిస్తారా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. యాంటీ సీఏఏ ఆందోళనలలో భాగంగా వివాదాస్పద కామెంట్స్​ చేసిన షర్జిల్ పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దీంతో షర్జీల్ కొన్నిరోజులుగా​ పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, అరుణాచల్​ప్రదేశ్, ఢిల్లీ పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బీహార్ ​పోలీసులకు తానే లొంగిపోయానని షర్జిల్ చెబుతుండగా.. వెతికి పట్టుకుని, అరెస్ట్​ చేశామని పోలీసులు అంటున్నారు.

ఎవరీ షర్జిల్ ఇమామ్?

32 ఏళ్ల  షర్జిల్​ జేఎన్​యూలో  పీహెచ్​డీ  స్కాలర్ ముంబై  ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నడు. జామియా మిలియా యూనివర్సిటీ దగ్గర రెచ్చేగొట్టే కామెంట్స్​ చేశారని ఆరోపణలున్నాయి.