ఉద్యోగాల పేరుతో టోకరా.. వ్యక్తి అరెస్టు

ఉద్యోగాల పేరుతో టోకరా..  వ్యక్తి అరెస్టు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న బండారి ప్రశాంత్ అనే వ్యక్తిని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు వరంగల్,ములుగు, పరకాల కోర్టులు,విద్యుత్ శాఖ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎంతోమంది యువతను మాయ మాటలతో నమ్మించాడు. అంతేకాదు.. నకిలీ ఆర్డర్ కాపీలను కూడా వారికి ఇచ్చాడు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఇలా దాదాపు రూ.35 లక్షలను బండారి ప్రశాంత్ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బుతో కారు, బైక్ లు కొన్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. అతడి నుంచి రూ.2.20 లక్షల నగదు, నాలుగు ఫేక్ జాబ్ ఆర్డర్ కాపీలు, రెండు సెల్ ఫోన్లు,కారును స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు..

ఒక వ్యక్తి, ఒక కుటుంబం చేతిలో బందీగా తెలంగాణ

రేపు సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్‌