ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం

ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు జో  బైడెన్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేసవిలో తమ దేశంలో పర్యటించాలంటూ ఆహ్వానం పలికారు. భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు అమెరికాలో పర్యటించాలని భారత ప్రధానిని, బైడెన్ కోరారు. ఈ విషయంపై స్పందించిన పీఎంఓ.. బైడెన్ ఆహ్వానం మేరకుప్రధాని త్వరలోనే అమెరికాలో పర్యటిస్తారని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ లో పర్యటించనున్నారు. జూన్, జులై లో అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్లు జరగనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మోడీ పర్యటనకు అనుకూలమైన షెడ్యూల్‌ను రూపొందిస్తామని పీఎంవో పేర్కొంది. ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, చైనా ఆధిపత్యం, ఉగ్రవాద నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ బలోపేతం, దౌత్య సంబంధాలపై ఇరు దేశాల అధినేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదీ గాక స్వయంగా బైడెన్, ప్రధాని మోడీని ఆహ్వానించడం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా సహా రష్యా పలు దేశాలు ఈ సమావేశంపై ఆసక్తిని ప్రదర్శించడం చెప్పుకోదగిన విషయం. దాంతో పాటు ప్రపంచంలోని రెండు దేశాలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని.. అందుకే భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీని అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఆహ్వానించినట్లు వైట్ హౌస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.  ఆహారం, ఆరోగ్య భద్రత, వాతావరణ సంక్షోభం, స్వేచ్ఛ, ఇండో-పసిఫిక్‌ సమస్యలు, పలు దేశాల నుంచి ముప్పు, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల గురించి కూడా యుఎస్-- ఇండియా చర్చిస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.