
- గీతం ఎన్సీసీ క్యాంప్లో కల్నల్ రమేశ్ సరియాల్
రామచంద్రాపుం (పటాన్చెరు), వెలుగు: క్రమశిక్షణ, దేశభక్తితో బాధ్యతాయుతమైన పౌరులుగా క్యాడెట్లు ఎదగాలని 33 బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రమేశ్ సరియాల్ సూచించారు. మంగళవారం గీతం వర్సిటీలో 33వ బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్ల యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ను ప్రారంభించి మాట్లాడారు. క్యాడెట్లు కఠినమై శిక్షన పొందేందుకు, నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంచుకునేందుకు క్యాంపులు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. అంకితభావం, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాడానికి ఎన్సీసీ ఒక మంచి అవకాశమన్నారు.
శారీరక దృఢత్వం, మానసిక శ్రేయస్సు ఎంతో ముఖ్యమైనవని సూచించారు. ఈ క్యాంపులో 600 మంది క్యాడెట్లకు పది రోజల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇలాంటి క్యాంపులను ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న గీతం వర్సిటీని ఆయన అభినందించారు. కార్యక్రమంలో 9, 12, 32, 33 బెటాలియన్ల కమాండ్ అధికారులు, క్యాడెట్లు పాల్గొన్నారు.