కొత్తగూడెంలో విలేకర్ల నిరసన

కొత్తగూడెంలో విలేకర్ల నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మీడియాపై దాడులు చేస్తే క్రిమినల్​ కేసులు పెట్టాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్​ కుమార్ అన్నారు. హైదరాబాద్​లోని మహా టీవీ న్యూస్​ ఛానల్​  ఆఫీస్​పై  కొందరు దాడి చేసి విధ్వంసం సృష్టించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆదివారం విలేకరులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం బస్టాండ్​ సెంటర్​లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్​ఎస్​కు చెందిన కొందరు వ్యక్తులు ఆఫీస్​పై దాడి చేయడంతో పాటు సిబ్బందిని గాయపర్చడాన్ని ప్రజస్వామికవాదులంతా ఖండించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో సీనియర్​ విలేకర్లు ఎర్రా ఈశ్వర్, రాజేశ్, పి. రాజేందర్, లక్ష్మణ్, బాదావత్​ దశరథ్​, కలీం, భాస్కర్​, శివకృష్ణ, రవికుమార్, రమేశ్, కృష్ణం రాజు పాల్గొన్నారు.