
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మీడియాపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని మహా టీవీ న్యూస్ ఛానల్ ఆఫీస్పై కొందరు దాడి చేసి విధ్వంసం సృష్టించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆదివారం విలేకరులు నిరసన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్కు చెందిన కొందరు వ్యక్తులు ఆఫీస్పై దాడి చేయడంతో పాటు సిబ్బందిని గాయపర్చడాన్ని ప్రజస్వామికవాదులంతా ఖండించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో సీనియర్ విలేకర్లు ఎర్రా ఈశ్వర్, రాజేశ్, పి. రాజేందర్, లక్ష్మణ్, బాదావత్ దశరథ్, కలీం, భాస్కర్, శివకృష్ణ, రవికుమార్, రమేశ్, కృష్ణం రాజు పాల్గొన్నారు.