నిర్మల్, వెలుగు: జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్మల్లో చేపట్టిన రిలే దీక్షలు నాటికి 6వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం వివిధ సంఘాలు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు.
