బ్యాలెట్‌‌‌‌ యూనిట్ల ర్యాండ మైజేషన్‌‌‌‌ పూర్తి

బ్యాలెట్‌‌‌‌ యూనిట్ల ర్యాండ మైజేషన్‌‌‌‌ పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నిర్వహణకు ఉపయోగించే బ్యాలెట్‌‌‌‌ యూనిట్ల (సప్లిమెంటరీ)ర్యాండమైజేషన్​ను ఆదివారం చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ లో చేపట్టారు. నోటాతో కలిపి మొత్తం 59 అభ్యర్థులు  బరిలో ఉండడంతో ఎన్నికల నిర్వహణకు అదనంగా బ్యాలెట్ యూనిట్​ల అవసరం అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ  కర్ణన్ అధ్వర్యంలో  రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో ర్యాండమైజేషన్‌‌‌‌ ప్రక్రియ పూర్తి చేసి   బ్యాలెట్ యూనిట్ లను  కేటాయించారు.