జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల 658 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గచరిత్రలోనే హయ్యెస్ట్ మెజారీటీ కావడం గమనార్హం. 10 రౌండ్ల ఫలితాల్లో ఏ ఒక్క రౌండ్ లోనూ బీఆర్ఎస్ ఆధిక్యం చూపించలేకపోయింది. ఇక ఈ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది.
కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సే: కేటీఆర్
- పార్టీకోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు
- జూబ్లీహిల్స్ లో మా అభ్యర్థి కొత్తే అయినా బాగా కష్టపడ్డారు
- మాగంటి సునీత చివరి వరకు పోరాటం చేశారు
- గెలిచినా ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతాం
- ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం
- ప్రజా క్షేత్రంలో, సోషల్ మీడియాలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతాం
- మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
- బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి
- ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు
- ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని ఈ ఉపఎన్నికతో తెలిసిపోయింది
జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలు : రౌండ్ల వారీగా కాంగ్రెస్ కు లీడ్
- ఫస్ట్ రౌండ్ : 47 ఓట్ల మెజార్టీ
- సెకండ్ రౌండ్ : 2 వేల 947
- థర్డ్ రౌండ్ : 3 వేల 100
- 4వ రౌండ్ : 3 వేల 547
- 5వ రౌండ్ : 3 వేల 300
- 6వ రౌండ్ : 2 వేల 938
- 7వ రౌండ్ : 4 వేల 030
- 8వ రౌండ్ : ఒక వెయ్యి 876
- 9వ రౌండ్ : 2 వేల 117
- 10 రౌండ్ : ఒక వెయ్యి 46
- మొత్తం మెజారిటీ : 24 వేల 658 ఓట్లు
నైతికంగా నేనే గెలిచా: మాగంటి సునీత
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
- అధికార పార్టీ రౌడీయిజం,రిగ్గింగ్ చేసి గెలిచింది
- ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాప్
- నైతికంగా నేనే గెలిచా
జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ ఘన విజయం
- పదో రౌండ్ లోనూ కాంగ్రెస్ కు లీడ్
- 24 వేల658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విక్టరీ
- నియోజకవర్గ చరిత్రలోనే హయ్యెస్ట్ మెజారిటీ
- బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ గల్లంతు
కొనసాగుతోన్న 10 వ రౌండ్ ఓట్ల లెక్కింపు
తొమ్మిదో రౌండ్ పూర్తి
- తొమ్మిదో రౌండ్ లో నూ కాంగ్రెస్ హవా
- 9వ రౌండ్ లో కాంగ్రెస్ కు 2117 ఓట్ల ఆధిక్యం
- 9 రౌండ్లు ముగిసే సరికి 23, 612 మెజారిటీ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు: మహేశ్ గౌడ్
- ఇది కాంగ్రెస్ ప్రజల విజయం
- ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
- కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
- సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ కు వరుస విజయాలు
- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుంది
- ఉప ఎన్నిల్లో గెలుపు కాంగ్రెస్ పాలనకు నిదర్శనం
- రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు
- వచ్చే 8 ఏళ్లు అధికారంలో ఉంటాం
- కొనసాగుతోన్న 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు
- ఏ ఒక్క రౌండ్ లోనూ ప్రభావం చూపని బీఆర్ఎస్
- ప్రతీ రౌండ్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం
ముగిసిన 8వ రౌండ్ కౌంటింగ్
- 8వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1,875 ఓట్ల మెజారిటీ
- 8వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 21వేల 495 లీడ్
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుండటంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి,వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతల సంబరాలు..
- స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్న మంత్రులు , ముఖ్య నేతలు
కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీశ్ తెలుసుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- పదేళ్లలో జూబ్లీహిల్స్ ను బీఆర్ఎస్ పట్టించుకోలేదు
- మున్సిపల్ మంత్రిగా పదేళ్లు కేటీఆర్ ఏం చేయలేదు
- కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా జూబ్లీహిల్స్ ను భ్రష్టు పట్టించారు
- సంక్షేమం,అభివృద్ధినే ప్రచారం చేశాం
- సీఎం రేవంత్ నేతృత్వంలో జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది
- బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రధానంగా ప్రచారం చేశాం
- కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీశ్ తెలుసుకోవాలి
- బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది
కొనసాగుతోన్న ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు
ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి
- వరుసగా ఏడో రౌండ్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం
- 7వ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 4 వేల 30 ఓట్ల అధిక్యం
- ఏడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 19,619 ఆధిక్యం
కొనసాగుతోన్న ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటి దగ్గర సంబరాలు
బాణా సంచా కాలుస్తూ కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
ఆరో రౌండ్ పూర్తి
- భారీ ఆధిక్యం దిశగా కాంగ్రెస్
- ఆరో రౌండ్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం
- ఆరు రౌండ్ లు ముగిసే సరికి కాంగ్రెస్ కు 15,589 ఆధిక్యం
గాంధీ భవన్లో సంబరాలు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండడంతో గాంధీ భవన్ కు ఒక్కొకరుగా చేరుకుంటున్న కార్యకర్తలు,నాయకులు..
- బాణసంచా తో పాటు బ్యాండ్ లతో మార్మోగుతున్న గాంధీ భవన్ పరిసరాలు...
కొనసాగుతోన్న ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు
ఐదో రౌండ్ పూర్తి
- జూబ్లీహిల్స్ బైపోల్ లో రౌండ్ రౌండ్ కు కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆధిక్యం
- ఐదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 12 వేల 651 ఓట్ల ఆధిక్యం
- జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు
- కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ భారీ ఆధిక్యంలో ఉండటంతో.. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత ఒక్కొక్కరుగా కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు.
కాంగ్రెస్ పార్టీదే విజయం
- జూబ్లి హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఊహించిందే
- జూబ్లి హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు అవ్వడం బాధాకరం
- ఓటింగ్ శాతం తగ్గడం మంచి పరిణామం కాదు.
- యువత ఓటు హక్కును వినిగించుకోలేదు.
- ఓటు హక్కు ను వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో విలువైనది.
- జూబ్లి హిల్స్ ఉప ఎన్నికల్లో బీ ఆర్ ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యారు.
కొనసాగుతోన్న ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు
- జూబ్లీహిల్స్ లో కొనసాగుతోన్న కాంగ్రెస్ హవా
- ప్రతి రౌండ్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం
- నాలుగో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 10 వేలకు పైగా ఆధిక్యం
- మొదలైన నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు
మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి 6 వేల47 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
మూడో రౌండ్ లో కాంగ్రెస్ కు 3100 ఓట్ల ఆధిక్యం
ఫలితాల అప్ డేట్ లో ఆలస్యం చేస్తోన్న ఎలక్షన్ కమిషన్
మూడో రౌండ్ పూర్తయినా..ఇంకా ఫస్ట్ రౌండ్ ఫలితాలే వెల్లడించిన ఈసీ
మూడో రౌండ్ లోనూ కాంగ్రెస్ కు కొనసాగుతోన్న ఆధిక్యం
మూడో రౌండ్ లో వెంగళ్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ ఓట్లు లెక్కింపు
రెండో రౌండ్
కాంగ్రెస్ - 9,691 ఓట్లు
బీఆర్ఎస్ -8,609 ఓట్లు
రెండో రౌండ్ ముగిసే సరికి 1144 కాంగ్రెస్ లీడ్
- రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 1082 ఓట్ల ఆధిక్యం
- తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు 62 ఓట్ల ఆధిక్యం
మొదటి రౌండ్
- కాంగ్రెస్ - 8,926
- బీఆర్ఎస్ - 8864
మొదటి రౌండ్ లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ
జూబ్లీహిల్స్ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
షేక్ పేట డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజ
పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు
- కాంగ్రెస్ -39
- బీఆర్ఎస్ -36
- బీజేపీ-10
- పోస్టల్ బ్యాలెట్లలో పదుల సంఖ్యలో చెల్లని ఓట్లు
- పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ కు ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది..
- ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు
- షేక్ పేట డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు
- మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- హోమ్ ఓటింగ్ ద్వారా వేసిన 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- హోమ్ ఓటింగ్ ద్వారా 101 ఓట్లు వేసిన వృద్ధులు, వికలాంగులు
సెంటర్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ఉంటుంది. అక్కడ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించి.. ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున, 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, 186 మంది సిబ్బందిలో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు. అప్డేట్స్ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు.
పార్టీల్లో ఉత్కంఠ
జూబ్లీహిల్స్లో విజేత ఎవరనేదానిపై ప్రధాన పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, తమ విజయం ఖాయమని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్కు భారీ మెజార్టీ వస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కావని, తమ అంచనాలే నిజమవుతాయని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తమ అభ్యర్థి మాగంటి సునీత విజయం సాధిస్తారని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మధ్య ఓట్లు చీలి తమ అభ్యర్థి లంకల దీపక్రెడ్డికి కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ వెలువడే ఫలితం ఉత్కంఠను పెంచనుంది. ఐదారు రౌండ్లలోపే గెలుపు అవకాశాలు తేలనున్నాయి.
