జావిద్ కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శ

జావిద్ కు ఎంపీ గడ్డం వంశీకృష్ణ  పరామర్శ

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడ్డ మందమర్రికి చెందిన కాంగ్రెస్​ లీడర్​ జావిద్​ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.

మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జావిద్​వద్దకు వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. రాళ్ల దాడిలో తలకు తీవ్ర గాయాలైన జావిద్ ​ప్రస్తుతం దవాఖానాలో చికిత్స పొందుతున్నారు.