- ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం
- మధ్యాహ్నం ఒంటి గంటకు 31 శాతం
- సాయంత్రం ఆరు గంటలకు మరింత పెరిగిన పోలింగ్
హైదరాబాద్సిటీ, వెలుగు : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ప్రారంభమైనా మందకొడిగానే కొనసాగింది. రహ్మత్నగర్లోని 165 పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం మొరాయించింది. దీంతో అధికారులు వెంటనే కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి ఎలక్షన్కొనసాగేలా చేశారు. షేక్ పేట్ డివిజన్ 30వ నంబర్పోలింగ్ బూత్ నెంబర్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల పోలింగ్ఆలస్యమైంది.
రహమత్నగర్, ఎర్రగడ్డ, షేక్పేట డివిజన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే ఓటర్ల రాక పెరిగింది. 9 గంటల సమయానికి ఆయా డివిజన్ల పరిధిలో 11శాతం పోలింగ్నమోదైంది. తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద సందడి పెరిగింది. ముఖ్యంగా ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ డివిజన్లలోనూ ఓటర్లు పోలింగ్బూతులకు తరలి వచ్చారు. దీంతో ఉదయం 11 గంటలకు 20.76 శాతం పోలింగ్ నమోదయినట్టు అధికారులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల తరలింపు
పోలింగ్శాతం తక్కువగా ఉండడంతో వివిధ రాజకీయ పార్టీల వారు కూడా ఓటర్ల తరలింపు కార్యక్రమం కొనసాగించారు. ముఖ్యంగా బస్తీలు, కాలనీల నుంచి జనాలు పోలింగ్కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
కొందరు ఆటోలను, టూవీలర్స్ ను అందుబాటులో ఉంచారు. పోలింగ్స్టేషన్కు రాలేని వారి కోసం ఎన్నికల అధికారులు సైతం వీల్చైర్లు, ఇతర వాహనాల ద్వారా పోలింగ్ఓటువేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో చాలా పోలింగ్ కేంద్రాలు రద్దీగా కనిపించాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పోలింగ్ 31 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ చాలా పోలింగ్కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. మధ్యాహ్నం 3గంటల సమయానికి పోలింగ్40 శాతానికి చేరింది.
సాయంత్రం తర్వాత ముఖ్యంగా మైనారిటీలు అధికంగా ఉండే బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట,యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో మళ్లీ పోలింగ్పెరిగి సాయంత్రం 6గంటల సమయానికి 47 శాతం పోలింగ్నమోదైంది. అయితే ఓటర్లకు అదనంగా మరో గంట పాటు ఓటింగ్కు అవకాశం కల్పిస్తామన్న ఎన్నికల అధికారులు సాయంత్రం 6గంటల వరకు పోలింగ్సమయాన్ని పెంచారు. ఆఖరు గంట సమయంలో పోలింగ్ బాగానే పుంజుకుంది. దీంతో పోలింగ్ ముగిసే సమయానికి 48 నుంచి 50 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ అంచనా వేశారు.
