అవినాష్ రెడ్డి పిటిషన్ పై ఉత్కంఠ

అవినాష్ రెడ్డి పిటిషన్ పై ఉత్కంఠ

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖాలు చేసిన మద్యంతర పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మార్చి 17న  తీర్పు వెల్లడించనుంది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని , పిటిషన్ తేలే వరకు తదుపరి విచారణపై స్టే ఇవ్వాలని అవినాష్ రెడ్డి పిటిషన్లు దాఖాలు చేశారు.

అవినాష్ తీర్పు వెల్లడించే వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన కోర్టు.. సీబీఐ కఠిన చర్యలు తీసుకోవద్దన్న అభ్యర్థనపై మార్చి 17న కోర్టు తీర్పు వెల్లడించనుంది. దీంతో హైకోర్టు తీర్పుపై అవినాష్ రెడ్డితో పాటు వైసీపీలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అవినాష్‌ను సీబీఐ నాలుగుసార్లు విచారించింది