నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి జూపల్లి

నేటితరం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి : మంత్రి జూపల్లి

మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని సూచించారు. నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ వద్ద మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైపాల్ రెడ్డి పుట్టుకతోటే పోలియో బారిన పడ్డాడని అన్నారు.

 ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా నాయకత్వం వహించి నాయకుడిగా ఎదిగారని జూపల్లి చెప్పారు. జైపాల్ రెడ్డి ప్రసంగం పార్లమెంట్లో చేస్తే నిశ్శబ్దంగా ఉండేదని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి పార్లమెంట్ లో ప్రసంగించేటప్పుడు విమర్శల జోలికి పోకుండా సమస్యల పట్ల మాట్లాడేవారని అన్నారు. పాలకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎంతో కృషి చేశారని చెప్పారు.