మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి..హిడ్మా బూటకపు ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి..హిడ్మా బూటకపు ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి
  • సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి

భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుస్నాబాద్,  వెలుగు: మావోయిస్టు హిడ్మాది బూటకపు ఎన్​కౌంటర్​ అని, తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన ప్రచార జాత మంగళవారం  సిద్దిపేట జిల్లా  హుస్నాబాద్ నుంచి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు చేరింది.

 ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ మారణహోమం సృష్టిస్తోందని ఆరోపించారు. అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఆపరేషన్​కగార్​ పేరిట బూటకపు ఎన్​కౌంటర్లను చేస్తోందని విమర్శించారు. ఎర్రజెండా పార్టీలు ఏకమయ్యేందుకు పునరాలోచించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.  

డిసెంబర్​26న ఖమ్మంలో జరిగే సీపీఐ వందేండ్ల ఉత్సవాలకు దేశ,విదేశాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపారు.  సీపీఐ రాష్ట్ర  సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనువాస్, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి,రాష్ట్ర నేతలు కలవేని శంకర్, అనిల్​, రమాదేవి, సంతోష్​, రమేశ్​పాల్గొన్నారు.