సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం స్వీకారం చేశారు. ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ హాజరయ్యారు.. జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే శుక్రవారం రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 2022 ఆగస్టు 26 వరకు పదవిలో కొనసాగనున్నారు. ఎన్వీ రమణ సుప్రీం చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన రెండో తెలుగు వ్యక్తిగా నిలిచారు.
ఏపీలోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో నూతలపాటి సరోజినీ దేవి- గణపతి రావు దంపతులకు 1957 ఆగస్టు 27న ఆయన జన్మించారు. కంచికర్లలో ప్రాథమిక విద్య, అమరావతిలో ఇంటర్, 1982లో ధరణికోట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు కుమార్తెలన్నారు. 1983 ఫిబ్రవరి 10న లాయర్ గా ఎన్ రోల్ అయ్యారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టుకు జడ్జిగా అపాయింట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు..
Delhi: Justice NV Ramana takes oath as the new Chief Justice of India (CJI). He was administered the oath by President Ram Nath Kovind, at Rashtrapati Bhavan. pic.twitter.com/jDESeLZh2D
— ANI (@ANI) April 24, 2021