
ముషీరాబాద్, వెలుగు: చిత్రపురి కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, పేద సినీ కార్మికులకు న్యాయం చేయాలని నవోదయ పార్టీ, చిత్రపురి సాధన సమితి ప్రతినిధులు డిమాండ్చేశారు. ఈ మేరకు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేపట్టారు. నవోదయం పార్టీ అధ్యక్షుడు శివశంకర్ పటేల్, డైరెక్టర్ మద్దినేని రమేశ్, హీరోయిన్ హేమ జిల్లోజు హాజరై మాట్లాడారు.
కోర్టు ఆర్డర్లను పట్టించుకోకుండా కో ఆపరేటివ్ అధికారులు చిత్రపురి అవినీతి కమిటీతో కుమ్మక్కైందని ఆరోపించారు. అడహక్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైరైజ్ అపార్ట్మెంట్లు వద్దని, అక్రమ రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దుచేసి నిజమైన పేద సినిమా కళాకారులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.