
మాజీ ఎంపీ, సీనియర్ నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. బీఆర్ ఎస్ పార్టీలో సీనియర్ లీడర్ గా, కేసీఆర్ కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే .. ఈ మధ్యే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేకే కూతురు GHMC మేయర్ గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
రాజ్యసభ ఎంపీగా తన పదవీకాలం ఇంకా రెండేండ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశారు కేకే. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యానని... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశాను అని తెలిపారు. 2026 ఏప్రిల్ 9 వరకు రాజ్యసభ ఎంపీగా కేకే పదవీకాలం ఉంది. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా పని చేసిన కేకే..జూలై 3న కాంగ్రెస్లో చేరారు. గతంలో కాంగ్రెస్ లోనే సుదీర్ఘకాలం ఉన్న ఆయన.. పీసీసీ చీఫ్గా పని చేశారు.