బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తరు : కె.రమ

బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తరు : కె.రమ

గోదావరిఖని, వెలుగు: రాబోయే పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని సీపీఐఎంఎల్​ మాస్​లైన్​ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కె.రమ ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలో పార్టీ ఉమ్మడి కరీంనగర్​, ఆదిలాబాద్​ జిల్లాల పార్లమెంట్​ ఎన్నికల జనరల్​ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మోదీ ప్రభుత్వం ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నారన్నారు. 

దేశ సంపదను కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకరించే విధంగా మోదీ నిర్ణయాలు ఉన్నాయన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ ఓటమే ధ్యేయంగా విప్లవశక్తులంతా కలిసి పనిచేయాలన్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో లీడర్లు జూపాక శ్రీనివాస్, నంది రామయ్య, గుజ్జుల సత్యనారాయణరెడ్డి, జాడి దేవరాజ్, జిందం రాంప్రసాద్, తోకల రమేశ్‌‌‌‌‌‌‌‌, వెంకన్న, శంకర్ పాల్గొన్నారు.