పీస్ ర్యాలీకి అనుమతివ్వకపోవడం దారుణం

పీస్ ర్యాలీకి అనుమతివ్వకపోవడం దారుణం

అక్టోబర్ 2న జరగాల్సిన పీస్ ర్యాలీకి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని కేఏ పాల్ తెలిపారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు. గాంధీ జాతిపిత అయితే.. కేసీఆర్ కూడా రాష్ట్రానికి జాతిపిత అని రాసుకోవడం సిగ్గుచేటన్నారు. పీస్ మీటింగ్కు ప్రముఖులు వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండేదని.. కానీ పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్లు కేఏ పాల్ తెలిపారు. 

తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు జాతీయ పార్టీతో దేశాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాడని కేఏ పాల్ విమర్శించారు. మునుగోడు ప్రజలు బాగా ఆలోచించి.. అభివృద్ధి చేసే పార్టీకే ఓటెయ్యాలని సూచించారు. కేసీఆర్ తెలంగాణను అవినీతి రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.