పవన్ కళ్యాణ్ నా పార్టీలో చేరితే.. కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తా: కేఏ పాల్

పవన్ కళ్యాణ్ నా పార్టీలో చేరితే.. కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తా: కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పార్టీని వదిలేసి తనతో కలిస్తే అమిత్ షాతో మాట్లాడి కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని ఆఫర్ చేశారు. ఇప్పటికే ఐదుగురికి కేంద్రమంత్రి పదవులు ఇప్పిచ్చినట్లు  చెప్పారు. 

పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు కేఏపాల్. బీజేపీ వాళ్లు ఏమైనా  వెయ్యి కోట్లు ఇచ్చారా? ఆర్నెళ్లు ఆగితే తాను అంతకంటే ఎక్కువే ఇస్తానని చెప్పారు. జనసేనకు నిలకడ లేదని.. అందుకే జేడీ లక్ష్మీనారాయణ తనతో కలిశారని..పవన్ కూడా తనతో కలవాలన్నారు. బీజేపీ వాళ్లు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఎక్కడో పవన్  చెప్పాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్  కాపాడటానికి  సుప్రీం కోర్టుతో పాటు ఏపీ హైకోర్టులో పిల్ వేసినట్లు చెప్పారు కేఏపాల్.