కేఏ పాల్ పార్టీ గుర్తు కుండ..

కేఏ పాల్ పార్టీ గుర్తు కుండ..

ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వెల్లడించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్ కుండ గుర్తును కేటాయించిందని తెలిపారు. కుటుంబ పాలన మనకు వద్దని కుండ పాలన కావాలని అన్నారు. కుండ గుర్తును తమకు కేటాయించినందుకు ఎన్నికల కమిషన్ కు దన్యవాదాలు తెలిపారు.

 తెలంగాణ, ఏపీలో కామన్ సింబల్ తో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. శాంతి పాలన రావాలంటే కుండ పాలన రావాలని తెలిపారు. మండుతున్న ఎండలకు డాక్టర్లు సైంటిస్టులు ఫ్రిజ్జిలోని నీళ్లు తాగొద్దని చెబుతున్నారని అందుకే మంచి జరగాలన్న మంచి చేయాలన్న కుండ పాలన రావాలని చెప్పారు. గతంలో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించింది ఈసీ. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ కుండ గుర్తును కేటాయిచింది.