పార్లమెంటరీ గ్రూప్ మెంబర్ గా కడియం కావ్య 

పార్లమెంటరీ గ్రూప్ మెంబర్ గా కడియం కావ్య 

గ్రేటర్​ వరంగల్, వెలుగు: ఇండియా–- సౌదీ ఆరేబియా పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్​ గ్రూప్​ సభ్యురాలిగా వరంగల్​ ఎంపీ డాక్టర్​ కడియం కావ్యను లోక్​సభ స్పీకర్​ నామినేట్ చేశారు. ఈ మేరకు లోక్​సభ సెక్రటేరియట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇండియా-  సౌదీ ఆరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఈ పార్లమెంటరీ ఫ్రెండ్​షిప్​ గ్రూప్​ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ ఈ బాధ్యత తనకు అప్పగించనందుకు లోక్​సభ స్పీకర్​ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.