భారత్ పై చైనా చేస్తున్న యుద్ధమే సెకండ్ వేవ్

భారత్ పై చైనా చేస్తున్న యుద్ధమే సెకండ్ వేవ్


న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ భారత్ మీద తీవ్ర ప్రభావం చూపిందని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్ వర్గియా అన్నారు. మన దేశంలో వైరస్ విజృంభణ వెనుక చైనా హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

'కరోనా సెకండ్ వేవ్ అకస్మాత్తుగా వ్యాపించిందా లేదా దాన్ని ఎవరైనా కావాలనే పంపారా? ఇది చర్చించాల్సిన అంశం. ఎందుకంటే ప్రపంచంలో చైనాను ఎదిరించిన దేశం భారత్ ఒక్కటే. డ్రాగన్ కంట్రీని ప్రధాని మోడీ సవాల్ చేశారు. మన దేశాన్ని వేధించాలనే చైనా ఇలా చేస్తోందని మేం నమ్ముతున్నాం. ఎందుకంటే సెకండ్ వేవ్ కేవలం భారత్ లోనే వ్యాప్తిస్తోంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గానిస్థాన్ లో సెకండ్ వేవ్ ప్రభావం లేదు' అని కైలాశ్ పేర్కొన్నారు.