కోటపల్లి టైగర్స్​పై చెన్నూరు టైగర్స్​ గ్రాండ్​ విక్టరీ

కోటపల్లి టైగర్స్​పై  చెన్నూరు టైగర్స్​ గ్రాండ్​ విక్టరీ

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, చెన్నూర్​నియోజకవర్గాల్లో ‘కాకా వెంకటస్వామి కప్’ పేరిట నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. గురువారం రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్​ స్టేడియంలో రామకృష్ణాపూర్ క్రికెట్ క్లబ్, జైపూర్​జాగ్వార్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో రామకృష్ణాపూర్​క్రికెట్​క్లబ్​టీమ్​ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​చేసిన రామకృష్ణాపూర్​టీమ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్​దిగిన జైపూర్​జాగ్వార్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసింది. 17 రన్స్​తేడాతో ఆర్కేపీ క్లబ్ టీమ్ విజయం సాధించింది. అదే టీమ్ కు చెందిన బి.వి.రామారావు 50 రన్స్​చేసి ప్లేయర్ ఆఫ్​ది మ్యాచ్​గా నిలిచాడు. రెండో మ్యాచ్​చెన్నూరు టైగర్స్, కోటపల్లి టైగర్స్​టీమ్స్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్​చేసిన చెన్నూరు టీమ్ 5 వికెట్లు నష్టానికి 215 పరుగులు చేయగా, కోటపల్లి టీమ్ 18.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. 95 పరుగుల తేడాతో చెన్నూరు టైగర్స్​టీమ్​భారీ విజయాన్ని అందుకుంది. 9 ఫోర్లతో 64 పరుగులు చేసిన సాయిచంద్​ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

బెల్లంపల్లి ఏఎంసీ-–2 గ్రౌండ్​లో జరిగిన మ్యాచ్​లో కాసీపేట టీమ్​9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​చేసిన కన్నెపల్లి టీమ్19 ఓవర్లలో కేవలం 68 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కాసీపేట టీమ్​కేవలం 7.1 ఓవర్లలో వికెట్​నష్టానికి టార్గెట్​ను చేజ్​చేసింది. కేవలం ఎనిమిది పరుగులు ఇచ్చి, 3 వికెట్ల పడగొట్టిన అఖిల్.ఎం.జె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. మరో మ్యాచ్​లో తాండూర్ టీమ్​భీమిని టీమ్ పై 95 పరుగులు తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన తాండూర్​టీమ్​20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి198 పరుగులు చేయగా, భీమిని టీమ్​15.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయ్యింది.3 వికెట్లు తీయడంతోపాటు 22 పరుగులు చేసిన సాయి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ దక్కించుకున్నాడు.