అట్టహాసంగా ‘కాకా’ మెమోరియల్ టోర్నీ..విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

అట్టహాసంగా ‘కాకా’ మెమోరియల్ టోర్నీ..విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

కోల్​బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20​ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలం 13 బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్​లో జరిగిన పోటీలను బెటాలియన్​కమాండెంట్​ వెంకటరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు ఈ టోర్నీని నిర్వహించడం గొప్పవిషయమన్నారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. విశాక ఇండస్ట్రీస్​సౌజన్యంతో హెచ్ సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా స్థాయిలో నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల జట్లు పోటీల్లో తలపడుతున్నాయి. కార్యక్రమంలో 13 బెటాలియన్ ​అసిస్టెంట్ ​కమాండెంట్లు కాళీదాస్, బాలయ్య, హెచ్​సీఏ జిల్లా కోచ్​ప్రదీప్,  సభ్యుడు తిరుపతి బెటాలియన్​ ఆర్​ఐలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.

గెలిచిన ఆదిలాబాద్, మంచిర్యాల జట్లు

మొదటి రోజు రెండు లీగ్​ మ్యాచ్​లు జరిగాయి.మొదటి మ్యాచ్​లో నిర్మల్​పై ఆదిలాబాద్​జట్టు గెలిచింది. టాస్​ గెలిచిన నిర్మల్​ మొదట బ్యాటింగ్​ చేసి 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 రన్స్​ చేసింది. సందీప్, ఆర్.శ్రీప్రధాన్ ​చెరో 25 రన్స్​ చేశారు. 

ప్రత్యర్థి బౌలర్లు అనాస్ ​సయ్యద్, మహ్మద్​అనాస్​ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఆదిలాబాద్ ​జట్టు 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటర్ చందన్ 10 ఫోర్లు, ఓ సిక్స్​తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ​72 రన్స్​తో నాటౌట్​గా నిలిచి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ దక్కించుకున్నాడు.  

9 వికెట్ల తేడాతో గెలిచిన మంచిర్యాల

మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్​లో మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లా జట్లు తలపడగా.. మంచిర్యాల ఘన విజయం సాధించింది. ఆసిఫాబాద్​ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 రన్స్ మాత్రమే​ చేసింది. సందేశ్(46) టాప్ ​స్కోరర్. అనంతరం బ్యాటింగ్ దిగిన మంచిర్యాల ఒక్క వికెట్ ​మాత్రమే  కోల్పోయి కేవలం 8 ఓవర్లతో 121 రన్స్​చేసి విజయం సాధించింది. నిఖిల్​ సాయి 10 ఫోర్లు, 4 సిక్స్​లతో విజృంభించి 78 రన్స్ చేసి నాటౌట్​గా నిలిచాడు. అతడికే మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.