కర్ణాటకలో గుడి పేరుతో వెబ్ సైట్లు

కర్ణాటకలో గుడి పేరుతో వెబ్ సైట్లు

బెంగళూరు: గుడి పేరుతో దొంగ వెబ్​సైట్లు తయారుచేసి కోట్లు కొల్లగొట్టిన సంఘటన కర్నాటకలోని కలబుర్గిలో చోటుచేసుకుంది. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఎనిమిది వెబ్​సైట్లను ఓపెన్​ చేసి పూజారులు సొమ్ము వసూలు చేశారు. నాలుగేళ్ల పాటు సాగిన ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కులబుర్గి జిల్లాలోని దేవలగనాపూర్ గుడికి కర్నాటకతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా భక్తులు వెళ్తుంటారు. అక్కడ కొలువైన దత్తాత్రేయుడిని దర్శించుకుని వస్తుంటారు. ప్రజల్లో ఉన్న భక్తిని సొమ్ము చేసుకోవడానికి ఆ ఆలయ పూజారులు ప్లాన్​ వేశారు. గుడి పేరుతో ఫేక్​ వెబ్​సైట్లు తయారు చేశారు. గుడిలో చేసే వివిధ పూజలకు ఆన్​లైన్​లో ఫీజులు వసూలు చేశారు. ఆలయ అభివృద్ధి పేరుతో విరాళాలు సేకరించారు. ఇలా వచ్చిన మొత్తాన్ని తమ పర్సనల్​ ఖాతాల్లోకి మళ్లించారు. దాదాపు 2 వేల మందికి పైగా భక్తుల నుంచి రూ.20 కోట్ల దాకా వసూలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆడిట్​లో ఈ దొంగ వెబ్​సైట్​ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్​ యశ్వంత్​ గురుకార్​దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్​ కేసు నమోదు కావడంతో ఈ దోపిడీలో భాగస్వామ్యం ఉన్న పూజారులు జారుకున్నారు. కాగా, ఆలయంలోని హుండీ సొమ్మును కూడా కాజేసి ఉంటారని పోలీసులు 
అనుమానం వ్యక్తం చేస్తున్నారు.