కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ చేపట్టాలి: భట్టి

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో  విచారణ చేపట్టాలి: భట్టి

తుమ్మిడిహెట్టి దగ్గరి నుంచి ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్టు ను లక్ష కోట్ల కోసం తరలించారని ఆరోపించారు కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క. కాళేశ్వరం పూర్తిగా కాకముందే గొప్పలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము దోపిడీ చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్నారు. ప్రాజెక్టు అవకతవకల పై కేంద్రం సిబిఐ తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు భట్టి.