
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన భారీ నీటి పంపులు ఒకటొకటిగా పంపింగ్కు సిద్ధమవుతున్నాయి. బుధవారం నందిమేడారం సర్జ్పూల్లో 3వ, 4వ మోటార్లకు వెట్రన్ను విజయవంతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12.50 నుంచి 12.45 గంటల వరకు మూడో మోటార్ను నడిపారు. సాయంత్రం 6.40 నుంచి 7.10 గంటల వరకు నాలుగో మోటార్ను రన్ చేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్ శ్రీధర్రావు దేశ్పాండే, లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ట్రాన్స్కో డైరెక్టర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో మొదటి రెండు మోటార్లకు విజయవంతంగా వెట్రన్ చేపట్టారు. మొత్తం ఏడు మోటార్లకు గాను 4 మోటార్లు పంపింగ్కు సిద్ధంగా ఉండగా, వాటిని విజయవంతగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. 5, 6, 7 మోటార్ల నిర్మాణం కొనసాగుతోందని అన్నారు.