కాళేశ్వరం లింక్- 2 పనులను అడ్డుకున్న గ్రామస్థులు
పెగడపల్లి, వెలుగు: కాళేశ్వరం అదనపు టీఎంసీ నిర్మాణం కోసం చేపడుతున్న లింక్ 2 పనులను జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్, ఏడు మూటలపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. సోమవారం లింక్ 2 పనుల వద్దకు వెళ్లి ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదంటూ వెహికల్స్ఎదుట బైఠాయించారు. సుమారు గంటపాటు నిరసన వ్యక్తం చేసి మెగా కంపెనీ ఇంజనీర్లతో వాగ్వాదానికి దిగారు. మాకు ప్రాజెక్టులు వద్దు.. భూములే కావాలంటూ నినాదాలు చేశారు. ఎకరానికి 30 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో మాధురి సమక్షంలో గ్రామసభ నిర్వహించగా గ్రామస్థులెవరూ హాజరు కాలేదు. ఈ సందర్భంగా రైతులు జొన్నల అమరేందర రెడ్డి మాట్లాడుతూ నామాపూర్ గ్రామంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద ఇప్పటికే మూడు సార్లు భూములు లాక్కున్నారని, ఈ లింకు ద్వారా 4వ సారి భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.