- నడిమికి పగిలిన సీసీ రోడ్డు, నిలిచిన రవాణా
- బయటపడిన రూ.800 కోట్ల కెనాల్ పనితనం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్ వాల్ 100 మీటర్ల మేర కుంగిపోయింది. మూడేండ్ల కిందే కట్టిన ఈ ప్రాజెక్టు పనితనం అప్పుడే బయటపడుతోంది. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కన్నెపల్లి(లక్ష్మి) పంప్హౌస్నుంచి గోదావరి నీళ్లను అన్నారం పంప్హౌస్లోకి తీసుకెళ్లడానికి రూ.800 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కెనాల్ కట్టారు. అయితే తాజాగా అన్నారం గ్రామానికి దగ్గరలో 12వ కిలోమీటర్ దగ్గర సుమారు వంద మీటర్ల కెనాల్ వాల్ భూమిలోకి కుంగిపోయింది. దీంతో పక్కనే ఉన్న బీటీ రోడ్డు భూకంపం వచ్చినట్టు రెండు ముక్కలుగా చీలిపోయింది. కెనాల్ కింద సిమెంట్ కాంక్రీట్తో కట్టిన నిర్మాణం పగిలి పైకి తేలింది. రోడ్డు పగలడంతో ఐదు గ్రామాలకు రవాణా ఆగిపోయింది. కాంట్రాక్టర్ నాసిరకం పనులు, ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం వల్ల రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.