- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ లో ఆలస్యంగా తెలిసిన ఘటన
వేములవాడ, వెలుగు : ప్రైవేటు స్కూల్ప్రిన్సిపాల్ కొట్టడడంతో ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థుల చేతులు విరిగిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ టౌన్ లోని ప్రైవేట్ స్కూల్ లో విద్యార్థులు సాయి, అయాన్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు.
స్కూల్కు సరిగా రావడంలేదని సోమవారం ప్రిన్సిపల్ కొట్టడడంతో అయాన్ చేయి, సాయి చేతి వేలు విరిగాయి. తన తల్లికి ఆపరేషన్ కావడంతో 15 రోజులుగా స్కూల్కు వెళ్లలేదని, తండ్రి గల్ఫ్లో ఉండడంతో తల్లిని చూసుకోవడానికి ఇంటి వద్దే ఉన్నానని అయాన్పేర్కొన్నాడు.
అనంతరం స్కూల్ కు వెళ్లగా ప్రిన్సిపల్.. ఎందుకు స్కూల్ కు రాలేదని అడగ్గా.. తన తల్లి అనారోగ్యం వివరాలు చెప్పి పర్మిషన్ కోరినట్టు బాధిత విద్యార్థి తెలి పారు. అయినా.. మ్యాథ్స్నోట్స్కంప్లీట్చేయలేదనే కారణంతో ప్రిన్సిపల్ చితకబాదినట్టు వాపోయాడు.
మరో విద్యార్థి సాయిని కూడా కారణం లేకుండానే ప్రిన్సిపాల్ దారుణంగా కొట్టాడు. దీంతో అయాన్కు చేయి విరగ్గా, సాయికి చేతి వేలు ఫ్యాక్చరైంది. బాధిత విద్యార్థులు తమ ఇండ్లలో చెప్పారు. స్కూల్ కు ప్రిన్సిపాల్ను నిలదీశారు. దీంతో స్కూల్యాజమాన్యం ఘటనపై బయటకు రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలకు దిగినట్లు తెలిసింది.
