
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా జూన్ 27న ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేయడానికి థియేటర్స్ కి వస్తోంది కల్కి.
ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా.. ఇండియన్ సినీ స్టాండర్డ్స్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా కోసం వరల్డ్ సినీ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మరి వారం రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపధ్యంలో కల్కి స్పెషల్ షోస్ గురించి, టికెట్ రేట్ హైక్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు.. కల్కి సినిమాకు బెనిఫిట్ షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారత మేకర్స్. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకోనున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 140 కోట్ల బిజినెస్ చేసింది కల్కి మూవీ. కాబట్టి.. ఈ సినిమా బ్రేకివెన్ అవ్వాలంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.