యాదగిరిగుట్ట, వెలుగు: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు అవినీతికి పాల్పడి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అవినీతికి కేరాఫ్ గా మారిందని నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న పాదయాత్ర శనివారం రాత్రి యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లుగా గుర్తుకు రాని ఉద్యోగాల భర్తీ ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ప్రకటించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను రూ.4 లక్షల కోట్ల అప్పులకు తెచ్చి రాష్ట్రాన్ని 50 ఏండ్లు వెనక్కి తీసుకుపోయాడని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి డెవలప్మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారన్నారు. బస్వాపూర్, గందమల్ల రిజర్వాయర్ల పేరుతో ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్న సీఎం, గంధమల్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఆలేరుకు దక్కాల్సిన తపాసుపల్లి రిజర్వాయర్ నీళ్లను మంత్రి హరీశ్రావు సిద్దిపేట తీసుకుపోతుంటే హారతి పట్టిన ఘనత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకే దక్కిందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అంతకుముందు మల్లన్న పాదయాత్ర రాజాపేట మండలం నుంచి పొట్టిమర్రి, గౌరాయపల్లి, మాసాయిపేట, సైదాపురం మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుంది. ఆదివారం భువనగిరికి వెళ్లనున్నారు.
నేడు మల్లన్న పాదయాత్ర ముగింపు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఆదివారం ముగియనుంది. యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరికి చేరుకోవడంతో 1,650 కిలోమీటర్ల పాదయాత్ర ముగుస్తోంది. ముగింపు సందర్భంగా మల్లన్న టీం భువనగిరిలోని ప్రిన్స్ కార్నర్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 1,650 కిలోమీటర్లు కొనసాగింది. ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని రాయగిరికి మల్లన్న చేరుకుంటారు. అక్కడి నుంచి భువనగిరిలోని ప్రిన్స్కార్నర్ వరకు మల్లన్న మద్దతుదారులు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగసభలో మల్లన్న ప్రసంగిస్తారు. బహిరంగసభను సక్సెస్ చేయాలని కోరుతూ ఆయన మద్దతుదారులు శనివారం భువనగిరిలో బైక్ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మల్లన్న టీం మెంబర్లు బంధారపు నర్సయ్య గౌడ్, కీసరి నర్సయ్యగౌడ్, తమ్మల నర్సింగ్ ముదిరాజ్, ఉదర బాలరాజ్ యాదవ్, ఎండీ కరీంపాషా, రామాండ్ల ప్రసాద్, లింగస్వామి, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
for more News..
కరోనా లాక్డౌన్ టైమ్ కుటుంబాలకు మేలే చేసింది
హైదరాబాద్లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్
కరప్షన్కు కేరాఫ్ కల్వకుంట్ల ఫ్యామిలీ
- తెలంగాణం
- January 3, 2021
లేటెస్ట్
- Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: RCBతో హై వోల్టేజ్ మ్యాచ్.. మార్కరం స్థానంలో విధ్వంసకర హిట్టర్
- ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
- V6 DIGITAL 25.04.2024 AFTERNOON EDITION
- Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున
- కాళేశ్వరం విచారణకు అవసరమైతే కేసీఆర్ను పిలుస్తాం: జస్టిస్ చంద్రఘోష్
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు