మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలోని దివ్యాంగులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం మెట్ పల్లి పట్టణంలో దివ్యాంగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ నియోజకవర్గంలో 4,950 మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చి ఆసరాగా నిలుస్తోందన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి మండలాల్లో పలు కుల సంఘాలను కలిసి మద్దతు కోరారు.
అనంతరం సుమారు 300 మంది బీఆర్ఎస్ లో చేరారు. మల్లాపూర్ మండలం చిట్టపూర్లో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ప్రచారం చేశారు. మెట్పల్లి, కోరుట్లలో మసీదుల వద్ద సంజయ్ను గెలిపించాలని కోరారు. కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో గంగపుత్ర, యాదవ, పద్మశాలీ, మేర, మాదిగ, మాల, మహిళా సంఘాల సభ్యులను కలిసి ఓటేయమని కోరారు.