పెరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం

పెరిగిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం

హైదరాబాద్ : కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద పెళ్లి కోసం ఇచ్చే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సాధారణ లబ్ధిదారుల కంటే వికలాంగులకు 25శాతం మొత్తాన్ని అధికంగా ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర చట్టానికి లోబడి ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం.

సాధారణంగా కల్యాణ లక్ష్మి అర్హులకు రూ.లక్షా 116 సాయం ప్రస్తుతం అందుతోంది. ఇక నుంచి పెళ్లికూతురు దివ్యాంగులైతే కనుక.. ఆమె తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయం రూ.లక్షా 25వేల 145 అందనుంది.