
భువనేశ్వర్: కల్యాణి స్టీల్ లిమిటెడ్ రూ.26వేల కోట్లతో ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలోని గజమారాలో టైటానియం మెటల్ ఏరోస్పేస్ విడిభాగాల తయారీ, ఇంటిగ్రేటెడ్ స్పెషాలిటీ స్టీల్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుందని ఒక అధికారి మంగళవారం తెలిపారు. ఇది ఒడిశాలో మొట్టమొదటి ఏరోస్పేస్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ కాబోతున్నందున ఈ యూనిట్కు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సాయంత్రం ఆమోదించిందని చీఫ్ సెక్రటరీ పికె జెనా వెల్లడించారు.
ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్ ఆటోమోటివ్ మాన్యుఫాక్చరింగ్లో గ్రోత్, ఇన్నోవేషన్లకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు వల్ల 12 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.