కామారెడ్డిటౌన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో బాధ్యతా యుతంగా విధులు నిర్వహించాలని కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీవోలు , ఏపీవోలకు నిర్వహించిన ట్రైనింగ్లో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు.
పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలన్నారు. నిర్లక్ష్యం వహించకుండా అలర్ట్గా ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో పీవోలు, ఏపీవోల పాత్ర కీలకమన్నారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, డీఈవో రాజు, కమిషనర్ రాజేందర్రెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ పాల్గొన్నారు.
