చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : ఆశిష్​ సంగ్వాన్​

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : ఆశిష్​ సంగ్వాన్​
  • కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​

కామారెడ్డి, వెలుగు :  యాసంగి వడ్లు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​  పేర్కొన్నారు. మంగళవారం బీబీపేట మండలంలోని  తుజాల్​పూర్​లో కొనుగోలు సెంటర్​ను, బీబీపేట మండల కేంద్రంలో  ఫెస్టిసైడ్ షాపును పరిశీలించారు.  మోడల్​ ఇందిరమ్మ ఇంటితో పాటు, పీహెచ్​సీని కలెక్టర్​విజిట్​ చేసి మాట్లాడారు. కొన్ని సెంటర్లలోనే ఇంకా వడ్లు మిగిలిఉన్నాయన్నారు.   ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చిన విత్తనాలు, ఎరువులు మాత్రమే అమ్మాలని సూచించారు.  

 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా  ప్రారంభించుకోవాలన్నారు. హాజరు రిజిస్ర్టర్​లో పలువురు సిబ్బంది సంతకాలు చేయకపోవడంతో మెడికల్​ ఆఫీసర్​ను ప్రశ్నించారు.  అనధికార సెలవుల్లో ఉన్న సూపర్​ వైజర్​ను సస్పెండ్ చేయాలని కలెక్టర్​ డీఎంహెచ్​వో ను ఆదేశించారు.   పోగ్రామ్​ ఆఫీసర్లను నోటీసులు జారీ చేయాలన్నారు.  

స్కూల్​ యూనిఫాం రెడీగా ఉంచాలి 

స్కూల్స్​ ప్రారంభానికి ముందే  విద్యార్థులకు యూనిఫాంలు రెడీగా ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు.    దోమకొండ మండల కేంద్రంలో యూనిఫాం కుట్టు కేంద్రాన్ని పరిశీలించి మహిళా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు.  మొత్తం 77,081 మంది స్టూడెంట్స్​కు యూనిఫాంలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు.  

 మహిళా సంఘాలు జిల్లాలో వడ్ల కొనుగోలు ద్వారా  3.20 కోట్ల ఆదాయం పొందారన్నారు.  ఇందిరా శక్తి క్యాంటిన్​ను  పరిశీలించారు.  కలెక్టర్​ వెంట డీఆర్డీవో సురేందర్​, డీసీవో రాంమోహన్​, డీఎంహెచ్​వో డాక్టర్ చంద్రశేఖర్, హార్టికల్చర్ ఆఫీసర్​ జ్యోతి,  జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుమల ప్రసాద్, డీపీఎం రమేశ్, ఎంపీడీవో పూర్ణచందర్,  తహసీల్దార్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.  

రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

కామారెడ్డి టౌన్, వెలుగు : జూన్​ 2 తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో ఆయా శాఖల జిల్లా అధికారులతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. వేడుకలను ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు అమరవీరుల స్థూపం దగ్గర క్లీన్ చేయించాలన్నారు.  చీఫ్​గెస్ట్​సందేశాన్ని రెడీ చేయాలని, అభివృద్ధి సంక్షేమ పథకాల శకటాల ప్రరద్శన,  స్టాల్స్​, కల్చరర్​ పోగ్రామ్స్ నిర్వహించాలన్నారు.

 లబ్ధిదారులకు సంక్షేమ పథకాల మంజూరు ఉత్తర్వులు అందించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్​, చందర్​, ఆర్డీవో వీణ , అధికారులు ఉన్నారు. టీబీ ముక్త్​ భారత్​ అభియాన్​ మీటింగ్​లో  మాట్లాడుతూ ఇంటింట సర్వే చేపట్టి టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు.  టెస్టులో వారికి టీబీ ఉన్నట్లు తేలితే మందుల కిట్,  పోషకాహారం కోసం రూ. 500 ఇవ్వాలన్నారు. డీఎంహెచ్​వో డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.