
- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అప్లికేషన్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం ఫరీద్ పేటలో రెవెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించి, రైతులతో మాట్లాడారు. భూభారతి ఆర్వోఆర్ చట్టం భూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక అన్నారు.
ప్రతి అప్లికేషన్ను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో వీణ, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీపతి, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.