రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి : ఆశిష్ సంగ్వాన్

 రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి : ఆశిష్ సంగ్వాన్
  • కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : రెవెన్యూ సదస్సుల్లో వచ్చే అప్లికేషన్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. శుక్రవారం పాల్వంచ మండలం ఫరీద్ పేటలో రెవెన్యూ సదస్సును కలెక్టర్​ పరిశీలించి,  రైతులతో మాట్లాడారు. భూభారతి ఆర్​వోఆర్​ చట్టం భూ సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక అన్నారు.

  ప్రతి అప్లికేషన్​ను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు.  ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.  ఆర్డీవో వీణ,  మండల స్పెషల్ ఆఫీసర్​ శ్రీపతి,  తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.