- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లాస్థాయి పూర్వ ప్రాథమిక బోధకుల 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 70 ప్రైమరీ స్కూల్లో ఈ ఏడాది పూర్వ ప్రాథమిక విద్యను అధికారికంగా ప్రారంభించామన్నారు. డీఈవో రాజు, ఎగ్జామినేషన్ అకాడమిక్ ఇయర్ ఇన్చార్జి వేణు, కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి నాగవేందర్, రిసోర్స్ పర్సన్లు నర్సింగ్రావు, హరిప్రసాద్, లింబాద్రి, నవీన్, ప్రశాంత్, భవాని, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇంటింట చెత్త సేకరణ చేపట్టాలి
కామారెడ్డిలో ఇంటింట చెత్త సేకరణ చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో పరిశుభ్రతపై కలెక్టర్ పరిశీలించారు. శానిటేషన్ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. రోడ్లు, కాలనీలను క్లీన్గా ఉంచాలన్నారు. రోడ్ల పక్కన చెత్త పెరుకుపోకుండా చూడాలన్నారు.
