
కామారెడ్డిటౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి టౌన్లోని రాజానగర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇసుక, మొరం విషయంలో ఇబ్బందులు రాకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్, హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి మండలం గర్గుల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య సెంటర్ను పరిశీలించారు. మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్కు నీటి వసతి, కరంటు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభు దయా కిరణ్ ఉన్నారు.