కామారెడ్డిలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్సంగ్వాన్

కామారెడ్డిలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిజన వాడలోని  బస్తీ దవాఖానాను తనిఖీ చేసి, డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్, పేషెంట్ రిజిష్టర్లను పరిశీలించారు.  అనంతరం బాల సదనం నిర్మాణ పనులను పరిశీలించారు.  డీఎంహెచ్​వో చంద్రశేఖర్​,  తహసీల్దార్​జనార్దన్, మున్సిపల్​ కమిషనర్​ రాజేందర్​రెడ్డి తదితరులుఉన్నారు.