
కామారెడ్డి టౌన్, వెలుగు : ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు కలిగిన పోడు భూముల్లో అధిక లాభాలు వచ్చే కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసుకునేలా గిరిజనులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ‘ఇందిరా సౌర గిరిజల వికాసం’పై అధికారుల రివ్యూలో మాట్లాడారు. పోడు పట్టాలు ఉన్నవారికి బోరు మోటార్, సోలార్ పంప్ సెట్లు మంజూరు చేసి భూములు సాగులోకి వచ్చేలా చూడాలన్నారు.
లబ్ధిదారులు ఎంపీడీవో ఆఫీసును సంప్రదించి స్కీం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచఇంచారు. . డీఎఫ్వో నిఖిత, అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్, ఆర్డీవో వీణ, జిల్లా గిరిజన అధికారి సతీష్ యాదవ్, డీఆర్డీవో సురేందర్, హార్టికల్చర్ అధికారి జ్యోతి, డీఏవో తిరుమల ప్రసాద్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెకిర్యాల్లో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. హౌజింగ్ పీజీ విజయ్పాల్రెడ్డి, కమిషనర్ రాజేందర్రెడ్డి, అధికారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ పార్క్ను కలెక్టర్ పరిశీలించారు.
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో అధికారుల మీటింగ్లో మాట్లాడారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్, జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల, డీఎంహెచ్వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.