
కామారెడ్డి టౌన్, వెలుగు: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ. 2 వేల జరిమానా విధిస్తూ కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి సీహెచ్ వీఆర్ఆర్వరప్రసాద్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపిన ప్రకారం.. జిల్లాలోని సదాశివనగర్మండలంలో హైవేపై కల్వర్టు కింద 2020 జూలై 10న ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి కేసు నమోదు చేసి మృతుడిని సదాశివనగర్కు చెందిన మాడల సతీశ్గా గుర్తించారు.
కాగా.. మద్నూర్ మండలానికి చెందిన రవికుమార్ అనే వ్యక్తితో కలిసి సతీశ్సదాశివనగర్ వైన్స్లో మందు తాగుతుండగా గొడవ జరిగింది. దీంతో సతీశ్ను చంపేందుకు నిర్ణయించుకుని రవికుమార్ఆర్మూర్వైపు వెళ్దామని నమ్మించి మర్కల్క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కల్వర్టుపై కూర్చున్న సతీష్ను రవికుమార్కిందకు తోశాడు. గాయాలైన అతడిపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన రవికుమార్అలియాస్రవిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వాదోపవాదాల అనంతరం రవికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.