వెనువెంటనే కరంట్ కనెక్షన్లు .. నెలల తరబడి పెండింగ్ లేకుంగా శాంక్షన్

వెనువెంటనే కరంట్ కనెక్షన్లు .. నెలల తరబడి పెండింగ్ లేకుంగా శాంక్షన్
  • స్పీడప్​చేసిన అధికారులు
  • కామారెడ్డి జిల్లాలో 3 నెలల్లో 1,711 కనెక్షన్లు మంజూరు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో అగ్రికల్చర్​కరంట్ కనెక్షన్లు వెంట వెంటనే శాంక్షన్​అవుతున్నాయి. కరంట్ కనెక్షన్లకు రైతులు నెలల తరబడి ఎదురు చూడకుండా ప్రభుత్వం దృష్టిపెట్టి వెనువెంటనే అనుమతిస్తోంది. ఫలితంగా లోవోల్టేజీ సమస్య లేకుండా కరంట్ సప్లయ్​ జరుగుతోంది. గతేడాది కాలంగా జిల్లాలో 4,294 కనెక్షన్లు ఇస్తే.. గడిచిన 3 నెలలల్లోనే  కొత్తగా 1,711 కనెక్షన్లు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయానికి యోగ్యమైన భూమి 5.40 లక్షల ఎకరాలు. 

సాగు నీటి ప్రాజెక్టులు అంతగా లేని ఈ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు  బోరు బావులే దిక్కు. ఎండాకాలంలో అగ్రికల్చర్​బోర్ల వినియోగం అధికంగా ఉంటుంది. అయితే గతంలో వ్యవసాయ కరంట్ కనెక్షన్లు కోసం రైతులు నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. బోర్లు తవ్వించి డీడీలు చెల్లించి సంబంధిత అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది.  కనెక్షన్లు శాంక్షన్​చేయాలంటూ రైతులు రోడ్డెక్కిన సందర్భాలున్నాయి. గతంలో పెండింగ్​లో ఉన్న అప్లికేషన్లలో 20 శాతం కోటా కూడా రిలీజ్​అయ్యేది కాదు. 

ఇప్పుడు కోటాకు మించి కనెక్షన్లు

కాంగ్రెస్​ప్రభుత్వంలో ఆ పరిస్థితి మారింది. అప్లికేషన్లు నెలల తరబడి పెండింగ్​లేకుండా అధికారులు చూస్తున్నారు. ఇప్పుడు కోటాకు మించి కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. బోరు తవ్విన తర్వాత రైతులు డీడీ చెల్లించి అన్​లైన్​లో అప్లయ్​ చేసుకోగానే.. ఎన్​పీడీసీఎల్​అధికారులు పరిశీలించి క్షేత్ర స్థాయి అధికారులతో ఎస్టిమేషన్​వేస్తున్నారు. ఆ తర్వాత కనెక్షన్​శాంక్షన్​చేస్తున్నారు. ఫలితంగా కొత్త ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటవుతున్నాయి.  33/11 కేవీ సబ్​స్టేషన్లు నిర్మిస్తున్నారు. 

లోవోల్టేజీ సమస్య తీరి అగ్రికల్చర్​కు నాణ్యమైన కరంట్ సప్లయ్​అవుతోంది. జూలై 2024 నుంచి ఈ ఏడాది జూన్​వరకు కొత్తగా 4,294  అగ్రికల్చర్​కరంట్ కనెక్షన్లు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్​నుంచి 3 నెలల కాలంలో కొత్తగా 1,711 కనెక్షన్లు శాంక్షన్​చేశారు. అప్లికేషన్ల సంఖ్యకు అనుగుణంగా సంస్థ ఆయా జిల్లాలకు కనెక్షన్ల ​ ​టార్గెట్ ​ఇస్తుంది.  ఏప్రిల్​, మే నెలలో టార్గెట్​కంటే ఎక్కువగా కనెక్షన్లు ఇచ్చారు.