
కామారెడ్డి, వెలుగు : తాడ్వాయి, రాజంపేట మండలాల్లోని పలు చోట్ల నిర్మించిన కల్వర్టుల దగ్గర బీటీ రోడ్లు వేయక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. తాడ్వాయి మండలం బ్రహ్మణ్పల్లి, సంగోజివాడి సమీపంలో పలుచోట్ల చిన్న బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.
పనులు కంప్లీట్ అయి నెలలు గడుస్తున్నా బీటీ రోడ్డు వేయక వెహికల్స్పై వెళ్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. రాజంపేట మండలం ఆర్గొండ, ఎల్లారెడ్డిపల్లి శివారుల్లో బ్రిడ్జిల నిర్మాణ పనులు కంప్లీట్ అయినప్పటికీ రోడ్డును అనుసంధానం చేస్తూ బీటీ రోడ్డు వేయలేదు. ఆర్అండ్బీ అధికారులు స్సందించి బ్రిడ్జిల దగ్గర బీటీ రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.