
కామారెడ్డి, వెలుగు : పీసీసీ కార్యవర్గంలో కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు చోటు దక్కింది. పీసీసీ జనరల్ సెక్రటరీలుగా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన గడ్డం చంద్రశేఖర్రెడ్డి, బద్దం ఇంద్రకరణ్రెడ్డిలను నియమించారు. పీపీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల లిస్టును సోమవారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసింది. పీపీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం కల్పించడంతో మంగళవారం పీపీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను హైదరాబాద్లో గడ్డం చంద్రశేఖర్రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డిలో సంబరాలు
పీసీసీ కార్యవర్గంలో చంద్రశేఖర్రెడ్డికి జనరల్ సెక్రటరీగా అవకాశం రావడంతో ఆ పార్టీ నాయకులు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో పటాకులు కాల్చారు. కేక్ కోసి ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకొన్నారు.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పార్టీ స్టేట్ ఇన్చార్జి మీనాక్షినటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో మాజీ కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశీ, జూలూరి సుధాకర్, రాంమోహన్, నాయకులు పంపరి శ్రీనివాస్, సలీమ్, సాయిబాబా, గ్యార సాయిలు, సూర్య తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన టీజీఎండీసీ చైర్మన్
బాల్కొండ,వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ ను టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మంగళవారం హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు.ఆయన వెంట వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి, కాంగ్రెస్ బాల్కొండ ప్రెసిడెంట్ వెంకటేశ్ గౌడ్ ఉన్నారు.