పీసీసీ జనరల్ సెక్రటరీలుగా కామారెడ్డి జిల్లా  నాయకులు

పీసీసీ జనరల్ సెక్రటరీలుగా కామారెడ్డి జిల్లా  నాయకులు

కామారెడ్డి, వెలుగు : పీసీసీ కార్యవర్గంలో కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్​ నాయకులకు చోటు దక్కింది.  పీసీసీ  జనరల్ సెక్రటరీలుగా కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన గడ్డం చంద్రశేఖర్​రెడ్డి, బద్దం ఇంద్రకరణ్​రెడ్డిలను నియమించారు. పీపీసీ వైస్​ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల లిస్టును సోమవారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసింది.   పీపీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం  కల్పించడంతో మంగళవారం పీపీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్​ను హైదరాబాద్​లో గడ్డం చంద్రశేఖర్​రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.  

కామారెడ్డిలో సంబరాలు 

పీసీసీ కార్యవర్గంలో చంద్రశేఖర్​రెడ్డికి జనరల్ సెక్రటరీగా అవకాశం రావడంతో ఆ పార్టీ నాయకులు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం  నిజాంసాగర్​ చౌరస్తాలో పటాకులు కాల్చారు.  కేక్​ కోసి ఒకరికి ఒకరు అభినందనలు తెలుపుకొన్నారు.  

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​,  పార్టీ స్టేట్ ఇన్​చార్జి మీనాక్షినటరాజన్​, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్​, సీఎం రేవంత్​రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.   ఇందులో  మాజీ కౌన్సిలర్లు పాత శివకృష్ణమూర్తి,  చాట్ల వంశీ,  జూలూరి సుధాకర్, రాంమోహన్​,  నాయకులు  పంపరి శ్రీనివాస్​,  సలీమ్​, సాయిబాబా,  గ్యార సాయిలు, సూర్య తదితరులు పాల్గొన్నారు.  

పీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన టీజీఎండీసీ చైర్మన్

బాల్కొండ,వెలుగు: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్ గౌడ్ ను టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ మంగళవారం హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు.ఆయన వెంట వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యం రెడ్డి, కాంగ్రెస్​ బాల్కొండ ప్రెసిడెంట్ వెంకటేశ్​ గౌడ్ ఉన్నారు.