
కామారెడ్డి టౌన్, వెలుగు : ఇటీవల అపరేషన్ కగార్లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ఫారెస్టు ఏరియాలో కుంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో మృతి చెందిన కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పరామర్శించారు. పాల్వంచ మండల కేంద్రానికి వెళ్లి బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.