కామారెడ్డి జిల్లాలో వరల్డ్​ క్యాండిల్​ లైట్​ డే

కామారెడ్డి జిల్లాలో వరల్డ్​ క్యాండిల్​ లైట్​ డే

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి వరల్డ్  క్యాండిల్  లైట్​ డే నిర్వహించారు. ఎయిడ్స్​, హెచ్​ఐవీ  బారిన పడి చనిపోయిన  బాధితుల స్మారకార్థం  ప్రతి ఏటా మే 3వ ఆదివారం  వరల్డ్​ క్యాండిల్​ డే నిర్వహిస్తున్నారు.  

గవర్నమెంట్ హాస్పిటల్​ నుంచి ఇందిరా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.  నేషనల్​ హెల్త్​ మిషన్​ డీపీఎం పద్మజా,  ఏఆర్​టీ డాక్టర్లు స్నేహ,  ప్రతికమల,  ఏఆర్​టీ కౌన్సిలర్లు నాగరాజు, గోపాల్, ఐఎస్​ఆర్​డీ ప్రతినిధి రాజేందర్, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.