- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు : పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. నామినేషన్ల స్వీకరణకు 213 మంది ఆఫీసర్లను నియమించామన్నారు. రిటర్నింగ్ అధికారులుగా 640 మంది వరకు నియమించామన్నారు. ప్రిసైడింగ్ అధికారులు 2,869 మంది, ఇతర పోలింగ్ అధికారులు 3,771 మందిని నియమించినట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 223, సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలు 557 ఉన్నాయన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.
సమస్యాత్మక కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు ఉంటారన్నారు. జిల్లాస్థాయిలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ) చైర్మన్గా ఈ కమిటీ ఉంటుందని, ఇందులో మెంబర్లుగా ముగ్గురు జిల్లాస్థాయి అధికారులు ఉంటారన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం మానిటరింగ్ చేస్తారని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తారన్నారు.
అడిషనల్ కలెక్టర్తో పాటు సిబ్బంది ఉంటారన్నారు. పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిశీలనకు జిల్లాస్థాయిలో నోడల్ అధికారి ఉంటారని, ప్రతి మండలానికి ఒక అధికారి ఉంటారని తెలిపారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ ఉంటుందన్నారు. అంతర్ జిల్లా సరిహద్దులో లిక్కర్, నగదు అక్రమ రవాణా కాకుండా 5 టీమ్లను ఏర్పాటు చేశామన్నారు. మీడియా మానిటరింగ్ కమిటీ పోటీ చేసే అభ్యర్థుల ప్రచార వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు
తెలిపారు.
