
కామారెడ్డి, వెలుగు: కంటైనర్ ను వెంబడించి దోపిడీకి పాల్పడిన మధ్యప్రదేశ్కు చెందిన ముఠాలోని ముగ్గురిని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర గురువారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. గత నెల11న నేషనల్ హైవేపై నిజామాబాద్వైపు కంటైనర్వెళ్తుండగా.. దోపిడీ దొంగలు బైక్ పై వెంబడించారు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్స్టేషన్పరిధి టెకిర్యాల్శివారులో ఆపారు. అనంతరం కంటైనర్ సీల్ను కట్టర్తో కట్ చేసి లోపలకు వెళ్లి సెల్ఫోన్లు, హెడ్సెట్స్ను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో 2 స్పెషల్టీమ్స్దర్యాప్తు చేపట్టాయి.
దోపిడీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల్లో ముగ్గురిని అరెస్టు చేశాయి. మధ్యప్రదేశ్కు చెందిన ప్రదీప్ హుడా, విమల్సిసోడియా, రితిక్ఝాంజ, మాల్వియా, దేవిసింగ్సిసోడియాను నిందితులుగా గుర్తించారు. వీరిలో రితిక్ఝాంజ, మాల్వియా దీపక్కుమార్, దేవిసింగ్ సిసోడియాను అరెస్ట్ చేయగా.. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు.
పట్టుబడిన నిందితుల నుంచి పల్సర్ బైక్, కత్తి, 3 సెల్ఫోన్లు, కట్టర్స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నిందితులు రన్నింగ్ లారీలను టార్గెట్ గా చేసుకుని పలు దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ, సీఐ రామన్, ఎస్ఐ రంజిత్, అనిల్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.